28/12/2016
TO,
ముఖ్యకార్యనిర్వాహణాధికారి గారికి, 29.12.2016
యువజన సంక్షేమ శాఖ, కృష్ణాజిల్లా.విజయవాడ.520008.
SIR,
విషయం:-ఢిల్లీ నుంచి అమృత్ సర్-వాఘా బోర్డర్ వరకు 2017 జనవరి
1 నుంచి 9 వరకు జరిగే సైకిల్ యాత్రకు ప్రోత్సాహం, చేయూత
కొరకు విన్నపం.
*****
1)-కృష్ణాజిల్లా యువజన సంక్షేమ శాఖ అనుబంధ సంస్థగా ఏర్పడిన యాక్టివ్ బైస్కలర్స్ అసోసియేషన్ కృష్ణాజిల్లా సంక్షేమ శాఖ సహాయం, చేయూతతో ఇప్పటికే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర నిర్వహించడం జరిగింది. కొద్దిపాటి దురానికి అంటే ఇంటి నుంచి ఆఫీసులకు, స్కూల్స్, కాలేజీలకు వెళ్ళేందుకు ప్రయాణ సాధనంగా సైకిల్ వినియోగించండి, ఇంధనం, డబ్బు పొదుపు చేయండి, పర్యావరణాన్ని రక్షించించండి, పట్టణాల్లో ట్రాఫిక్ ను నియంత్రించండి, సైకిల్ తొక్కేవారిని ప్రోత్సహించండి, గౌరవించండి అంటూ 2009లో మొదటిగా విజయవాడ నుంచి హైదరాబాదు వరకు సైకిల్ యాత్ర నిర్వహించడంతో ప్రారంభమై అనేక యాత్రలు చేయడంతోపాటు 2011 సంవత్సరంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి సైకిల్ యాత్ర పూర్తి చేయడం జరిగింది.
2)-ఇప్పుడు ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థులు ఢిల్లీ నుంచి వాఘా బోర్డరు వరకు శాంతిని కోరుతూ, సైకిల్ వినియోగం వల్ల ప్రయోజనాలను తెలియజేస్తూ సైకిల్ యాత్ర చేపట్టడం జరిగింది. ఈ యాత్రలో యాక్టివ్ బైస్కలర్స్ అసోసియేషన్ అనుబంధ సంస్థ అయిన విజయవాడ సైకిల్ క్లబ్ ఆధ్వర్యంలో 14 మంది పాల్గొంటున్నారు. ఇందు కోసం కృష్ణాజిల్లా యువజన సంక్షేమ శాఖ నుంచి ప్రోత్సాహం, చేయూత అందించాలని కోరుచున్నాం.
1)-VALLABHANENI SATYANARAYANA, 2)-CH.AISHWARYA 3)-CH.DIVYA 4)-CH.PRAVALIKA, 5)-R.SRINIVASA RAO, 6)-G.PADMAJA 7)-G.AMAR, 8)-G.SAMAR, 9)-A.CH.SEKHAR, 10)-K.CHANDU 11)-CH.DILLEP 12)-V.SRINU 13)-UNDAVALLU KRISHNAVENI, 14)-GOWRU.
కృతజ్ఞతలతో ఇట్లు
తమ విధేయుడు, సైక్లిస్టు
వల్లభనేని సత్యనారాయణ