24/08/2026
** ప్రముఖ రైతు నాయకుడు సారంపల్లి మల్లారెడ్డికి ‘రైతునేస్తం’ జోహార్లు **
------------------------------------------------------------------------------
సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు, రైతాంగ సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగి, రైతుల హక్కుల కోసం జీవితాంతం అలుపెరుగని పోరాటం చేసిన రైతు సంఘం అగ్రనేత సారంపల్లి మల్లారెడ్డి గారు ఈరోజు తెల్లవారుఝామున హైదరాబాద్లో అనారోగ్యంతో మృతి చెందారు.
వారి మృతి తీవ్రంగా కలచివేసిందని, రైతు కష్టాలను తన కష్టాలుగా భావించి, వారి హక్కులు, సంక్షేమం, అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడు మల్లారెడ్డి గారని రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్, పద్మశ్రీ పురస్కార గ్రహీత యడ్లపల్లి వేంకటేశ్వరరావు అన్నారు.
రైతు సమస్య ఏదైనా… దాని పరిష్కారం కోసం ఆయన గొంతు ఎప్పుడూ వినిపించేది. రైతాంగం కోసం ఆయన చేసిన పోరాటాలు, అందించిన సేవలు ఎప్పటికీ మరువలేనివి.
మల్లారెడ్డి గారి మరణం రైతు ఉద్యమానికి, కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా… రైతుల కోసం ఆయన సాగించిన పోరాట స్ఫూర్తి మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటుందని యడ్లపల్లి వేంకటేశ్వరరావు అన్నారు.
ఆయనను కోల్పోయిన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ విషాద సమయంలో ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. సారంపల్లి మల్లారెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన ఆశయాలు కొనసాగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఆయనకు నా ఘనమైన నివాళులు.
ఈ నిస్వార్థ రైతునేతను రైతునేస్తం మాసపత్రిక 17వ వార్షికోత్సవం సందర్భంగా అక్టోబర్ 30, 2021న రైతునేస్తం జీవిత సాఫల్య పురస్కారంతో ఘనంగా సత్కరించి గౌరవించింది.
సారంపల్లి మాల్లారెడ్డి గురించి….
తెలుగునాట సారంపల్లి మల్లారెడ్డి తెలియని రైతు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎనిమిది దశాబ్దాలు పైబడిన వారి జీవితంలో ఆరు దశాబ్దాల కాలం తాను నమ్ముకున్న భావజాలంతో రైతాంగ పక్షపాతిగా,
రైతు ఉద్యమనేతగా నిస్వార్థంగా పనిచేసి జాతీయస్థాయికి ఎదిగిన రైతునేత వీరు. వీరి జీవితాన్ని పరిశీలిస్తే ఎక్కడ రైతుకు అన్యాయం జరిగితే అక్కడ సారంపల్లి ప్రత్యక్షమవుతారు. ఎటువంటి భేషజాలకు పోకుండా అధైర్యపడకుండా రైతుపక్షాన నిలబడటమే వీరికి తెలుసు. రైతు, రైతు కూలీల సంక్షేమమే వారి శ్వాస, ధ్యాస, వారి ఆశ కూడా. 1973 వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ రైతు సంఘం కార్యదర్శిగా రైతుల తరఫున పోరాటం ప్రారంభించారు. అప్పుడు ప్రాంతంలోని కొత్తగూడెం, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ, దుగ్గొండి మండలాలలోని రైతుల భూసమస్యలను, బ్యాంకు, సహకార సంఘాల రుణ సమస్యలను, విద్యుత్ సమస్యలను పరిష్కరించడంలో కృషిచేస్తూ తన పోరాట పటిమను ప్రదర్శించారు. అప్పటి నుండి ఇప్పటివరకు పనిచేస్తున్న రైతు సంఘంలో అంచలంచెలుగా ఎదిగి 1999లో వారి రైతు సంఘానికి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రైతు సంఘం కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీటి వనరులు, భూసమస్యలు, విద్యుత్ సమస్యలు, సహకార రుణాలు, పంట రుణాలు, మార్కెట్ సమస్యలు, మార్కెట్ ధరల సమస్యలు, కరవులు, వరదలు నష్టాలు, రైతు ఆత్మహత్యలపైన రాష్ట్రవ్యాప్తంగా రైతాంగాన్ని కదిలించి ఆ సమస్యల పరిష్కారం కోసం వీరు సలిపిన ఎన్నో పోరాటాల ఫలితంగా కొన్ని సమస్యలు పరిష్కారమయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో అఖిలపక్ష రైతు సంఘాలను ఒక వేదికపైకి తెచ్చి రైతాంగ ఉద్యమాన్ని బలోపేతం చేయటానికి తీవ్రంగా శ్రమించారు. జీవిత కాలంలో ఉద్యమాల కారణంగా ఆరు మాసాల జైలుశిక్ష, రెండున్నరేళ్ళ అజ్ఞాత జీవితం గడిపారు. తన అపార అనుభవంతో 2008లో ‘రైతు ఉద్యమ చరిత్ర’ పుస్తకంతో ప్రారంభమైన వీరి అక్షర యాత్ర 2021లో ‘భారత రైతాంగ పోరాటాలు’ మీద సవివరమైన సమాచారంతో పుస్తకం రావటం జరిగింది. ఈ 18 ఏళ్ళ అక్షర ప్రస్థానంలో దాదాపు 30కి పైగా పుస్తకాలను రైతాంగ సమస్యలమీద, వ్యవసాయ సంక్షోభం మీద, తన అపార అనుభవంతో వాటి పరిష్కార మార్గాలు సూచిస్తూ తీసుకువచ్చి ముందుతరాలకు మార్గదర్శకంగా నిలిచారు.
యడ్లపల్లి వేంకటేశ్వరరావు
పద్మశ్రీ పురస్కార గ్రహీత
ఛైర్మన్, రైతునేస్తం ఫౌండేషన్
2021లో రైతునేస్తం జీవన సాఫల్య పురస్కారం అందుకుంటూ….
సారంపల్లి మల్లారెడ్డి జీవిత చరిత్ర
01.04.1956 నుండి 01.04.1964 వరకు లక్ష్మారెడ్డి పోలీస్ పటేల్
01.04.1964 నుండి 10.08.1971 వరకు మల్లా రెడ్డి పోలీస్ పటేల్
06.08.1971న తిమ్మంపేట గ్రామంపై కాంగ్రెస్ నాయకుల దాడి – ఎకెగోపాలన్ రావడం
1953లో మల్లారెడ్డి వివాహం
1954లో సారంపల్లి కృష్ణారెడ్డి మరణం (నాన్న)
07.10.1988 అమ్మ రాధమ్మ మరణం
1962లో అర్షనపల్లి వెంకటేశ్వరరావుకు (ఎంఎలఏ ప్రచారం గెలుపు)
25.08.1939 జన్మదినం
1957-58 పదవ తరగతి ఉత్తీర్ణత
06.07.1959 వాసుదేవరెడ్డి జననం
24.08.1962 మధుసూధన్రెడ్డి జననం
07.02.1964 కనకలక్ష్మీ మరణం
09.03.1966 భాగ్యలక్ష్మితో వివాహం
27.08.1975 అనిత జననం
15.02.1977 అజిత జననం
తిమ్మంపేట సర్పంచిగా (సిపియం పార్టీ)
ఎస్ మల్లారెడ్డి 12.06.1981 – 30.03.1988
1973 మార్చి పార్టీ సభ్యునిగా – పూర్తి కాలం కార్యకర్తగా – నర్సంపేట పార్టీ డివిజన్ కమిటీ
రైతు సంఘం :
1973 – నర్సంపేట డివిజన్ రైతుసంఘం కార్యదర్శిగా
1981- వరంగల్ జిల్లా రైతు సంఘం కార్యదర్శిగా
25.06.1978 రాష్ట్ర రైతు సంఘం 9 (హైదరాబాద్ మహాసభ)
10.05.1992 రైతు సంఘం రాష్ట్ర ఆఫీస్ బేరర్గా 14 (మధిర మహాసభ)
17.02.1999 రాష్ట్ర అధ్యక్షునిగా 16 (వరంగల్ మహాసభ)
21.02.2003 రాష్ట్ర కార్యదర్శిగా 17 (కర్నూల్ మహాసభ)
09.03.2003 ఏఐకెఎస్ ఉపాధ్యక్షునిగా (30వ మహాసభ)
సిపియం పార్టీ :
11.10.1981 వరంగల్ జిల్లా కమిటీకి 8 (నల్లబెల్లి మహాసభ)
25.08.1985 వరంగల్ జిల్లా కార్యదర్శి వర్గం 9 (ఇప్పగూడెం మహసభ)
03.11.1991 పార్టీ రాష్ట్రకమిటీ సభ్యునిగా (విశాఖ)
28.01.2005 పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గం (వరంగల్ మహాసభ)
04.03.2015 కంట్రోల్ కమిషన్ ఛైర్మన్గా (హైదరాబాద్ మహాసభ)
07.02.2018 రాష్ట్ర కమిటీ ఆహ్వానితునిగా (నల్గొండ మహాసభ)
అఖిల భారత మహాసభకు డెలిగేట్ 16వ మహాసభను 22వ మహాసభ వరకు డెలిగేట్
చదువు (ఎస్ మల్లారెడ్డి)
1949 – 50 మహబూబియా – వరంగల్ (2వ తరగతి)
1950 – 51 మహబూబియా – వరంగల్ (3వ తరగతి)
1951 – 52 మహబూబియా – వరంగల్ (4వ తరగతి)
1952 – 53 వేయిస్తంభాల గుడి – హన్మకొండ (5వ తరగతి)
1953 – 54 వస్తానియా వరంగల్ (6వ తరగతి)
1954 – 55 హైస్కూల్-నర్సంపేట (7వ తరగతి)
1955 – 56 వరంగల్ (8వ తరగతి)
1956 – 57 వరంగల్ (9వ తరగతి)
1957 – 58 వరంగల్ (10వ తరగతి) కుమార్పల్లి – హన్మకొండ
రచించిన పుస్తకాలు
రైతు ఉద్యమ చరిత్ర 1947-2007 (2008)
బడుగు రైతుల వెతలు 2008.
కమిషన్లు – రెకమండేషన్లు ఏప్రిల్ 2014.
కార్పొరేట్ దిశన వ్యవసాయం 2013.
రాష్ట్రంలో నదీజలాలు – ప్రాజెక్టులు – వినియోగం – వివాదాలు-జూన్ 2013.
తెలంగాణలో సాగునీటి వనరులు – అవకాశాలు-నవంబర్ 2015.
తెలంగాణ రైతాంగ భూ ఉద్యమాలు-ఏప్రిల్ 2016.
వ్యవసాయ సంక్షోభంలో రైతులు దివాళా-ఏప్రిల్ 2018.
అత్యంత ధనిక రాష్ట్ర జపం ఒకవైపు – అప్పుల పెనుభారం ఒకవైపు – ఏప్రిల్, 2018.
సహకార రుణాలు-2003.
పత్తి రైతులారా! ఆలోచించండి!!
“రైతు సంక్షేమం” – ప్రభుత్వంలో రైతు మేలెంత.
జనీవా చర్ౘ్ల్లో “ భారత వ్యవసాయరంగానికి రక్షణ కల్పించాలి.
ఎఫ్సీఐ వివరాలతో పార్లమెంటు సభ్యులకు పుస్తకాలు.
50 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మైనర్ ఇరిగేషన్ (విశ్లేషణ)
1956 వరకు రైతాంగ పోరాటాలు.
50 సంవత్సరాల సీపీఎం ప్రస్థానం.
ప్రపంచ బ్యాంకు సంస్కరణలు – వ్యవసాయరంగం – సాగునీటిరంగం.
ఆంధ్రలో రైతాంగ భూ ఉద్యమాలు-ఏప్రిల్ 2018
భారత రైతాంగ పోరాటాలు. 2020
కమ్యూనిజం వైపు అడుగులు & గ్రామంలో పార్టీ నిర్మాణం
తొలి పరిచయాలు: ఖాజీపేట రైల్వే గ్యాంగ్ కూలీ కుమ్మరికుంట్ల బొందయ్య ద్వారా సీపీఎం నాయకుడు ఓంకార్తో తిమ్మంపేట గ్రామానికి సంబంధాలు ఏర్పడ్డాయి. బొందయ్య ప్రేరణతో చదువు విరమించిన సారంపల్లి రాజిరెడ్డి ( తమ్ముడు) కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యాడు.
వ్యతిరేకత & నిబద్ధతః గ్రామంలోని పట్వారి, ఇతరులు రాజిరెడ్డితో కమ్యూనిజానికి వ్యతిరేకంగా ప్రకటన చేయించాలని చూసినా ఆయన నిరాకరించాడు. దీంతో వారిపై తప్పుడు కేసులు బనాయించారు. అయినప్పటికీ ముదిరాజులు, గీత కార్మికులు, రజకులు కమ్యూనిస్ట్ పార్టీకి అండగా నిలిచారు.
1962 ఎన్నికల విజయం: 1962 నర్సంపేట అసెంబ్లీ ఎన్నికల్లో పి.డి.ఎఫ్ (కమ్యూనిస్ట్) అభ్యర్థి అరిశెనపల్లి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థిపై 4,418 ఓట్లతో గెలిచారు. ఈ ఎన్నికల్లో పుచ్చలపల్లి సుందరయ్య, ఓంకార్ విస్తృతంగా ప్రచారం చేశారు. వెంకటేశ్వరరావు విజయం తిమ్మంపేట పరిసర గ్రామాల్లో గొప్ప ఉత్సాహాన్ని నింపి, 45 మంది మిలిటెంట్ సభ్యులతో తిమ్మంపేటను పార్టీకి తలమానికంగా మార్చింది.
రాజకీయ పరిణామాలు & 1971 చారిత్రక ఘటన
చీలికలను తట్టుకుని నిలబడటం: 1964లో సీపీఐ(ఎం) ఆవిర్భావం తర్వాత వరంగల్ జిల్లాలో మెజారిటీ నాయకులు సుందరయ్య నాయకత్వంలోని సీపీఎం వైపు నిలిచారు. 1967లో నక్సలైట్ల చీలిక వచ్చినా (ములుగు తాలూకా మినహా) తిమ్మంపేట పార్టీ దృఢంగా నిలబడింది.
పోలీసుపటేల్గా రక్షణః రచయిత అన్న లక్ష్మారెడ్డి సర్పంచ్గా పోటీ చేయడానికి పోలీసుపటేల్ పదవికి రాజీనామా చేయడంతో, 1964లో రచయిత పోలీసుపటేల్గా నియమితులై 1971 వరకు పార్టీ కార్యకర్తలను అరెస్టుల నుండి రక్షిస్తూ వచ్చారు.
1971 ఆగస్టు 6న కాంగ్రెస్ నాయకులు 200 మందితో తిమ్మంపేటపై దాడికి ప్రయత్నించగా, పార్టీ నాయకులు (రాజిరెడ్డి, చంద్రారెడ్డి తదితరులు) వ్యూహాత్మకంగా ఎదురుదాడి చేసి కాంగ్రెస్ మూకలను తరిమికొట్టారు.
ఈ ఘటనతో మల్లారెడ్డి పోలీసుపటేల్ పదవి నుండి సస్పెండ్ చేశారు. 72 మందిపై కేసులు పెట్టి సెంట్రల్ జైలుకు పంపారు.
ఈ నిర్బంధం తెలిసి 1971 ఆగస్టు 18న ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు ఎ.కె. గోపాలన్ తిమ్మంపేటకు వచ్చి బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. అదే రోజు నర్సంపేటలో 20,000 మందితో భారీ బహిరంగ సభ జరిగింది. 1973లో మల్లారెడ్డి కి సీపీఎమ్లో డివిజన్ కమిటీ బాధ్యతలు లభించాయి.
తిమ్మంపేట గ్రామాభివృద్ధి (42 ఏళ్ల సీపీఎం పాలన)
1964 జూలై 1 నుండి 2006 ఆగస్టు 22 వరకు సుదీర్ఘంగా 42 సంవత్సరాల పాటు తిమ్మంపేట పంచాయతీ, సింగిల్ విండోలు సీపీఐ(ఎం) పాలనలోనే ఉన్నాయి.
సర్పంచ్గా కృషి (1981 – 1988):
రచయిత ఏకకాలంలో సర్పంచ్గా, సింగిల్విండో అధ్యక్షుడిగా, జిల్లా సహకార బ్యాంక్ డైరెక్టర్గా సేవలందించారు.
అభివృద్ధి పనులు: High School భవనం, పక్కా పంచాయతీ భవనం, పశువైద్యశాల, తాగునీటి కోసం 2 వాటర్ ట్యాంకులు, 4 బోర్లు ఏర్పాటు చేశారు.
విద్యుద్దీకరణ (1972): అధికారులు మంజూరు చేసిన వారం రోజుల్లోనే శ్రమదానంతో గ్రామానికి విద్యుత్ కనెక్షన్లు పూర్తి చేశారు. ప్రజా నిరసన కారణంగా మంత్రులు (జలగం వెంగళరావు, తదితరులు) ప్రారంభించకుండానే వెళ్ళిపోగా, సర్పంచ్ రాజిరెడ్డి నాయకత్వంలోనే ప్రజలు విద్యుద్దీకరణను ప్రారంభించుకున్నారు.
భూపోరాటాలు: 1967లో 110 ఎకరాల ప్రభుత్వ బంచరాయి భూమిని పేదలకు పంచగా, 1985లో ఎన్టీఆర్ ప్రభుత్వంలో “భూసమారాధన” ద్వారా వాటికి పట్టాలు లభించాయి.
భార్గవ కమిషన్ & సాయుధ పరిణామాలు
1972లో జలగం వెంగళరావు ప్రభుత్వం చేసిన నక్సలైట్ ఎన్కౌంటర్లపై సుందరయ్య అసెంబ్లీలో పోరాడి జస్టిస్ భార్గవ కమిషన్ వేయించారు.
నక్సలైట్ నాయకుడు రాంనర్సయ్యను పోలీసులు పాకాల చెరువు వద్ద కాల్చి చంపగా, దానికి సంబంధించిన సాక్షుల నుండి అఫిడవిట్లు తయారు చేసి భార్గవ కమిషన్కు సమర్పించే కీలక బాధ్యతను మల్లారెడ్డి నెరవేర్చారు.
మల్లారెడ్డి ప్రభావితం చేసిన సాహిత్యం & మార్క్సిస్ట్ పాఠాలు
రచయిత తన జీవితంలో ఎదురైన ఆటుపోట్లను తట్టుకోవడానికి, సీపీఎంను బలోపేతం చేయడానికి క్రింది పుస్తకాలు మార్గదర్శకంగా నిలిచాయని పేర్కొన్నారు:
చైనాపై అరుణతార (ఎడ్గార్ స్నో): చైనా ప్రజా సైన్యం లాంగ్మార్చ్, త్యాగాలు మరియు మార్క్సిజం పునాదిగా చైనా సాధించిన ప్రగతిని వివరించింది.
జైత్రయాత్ర (చూటే జీవిత చరిత్ర): దురలవాట్లను వదిలి సామాన్యుడి నుండి ఆర్మీ అధిపతిగా ఎదిగిన చూటే జీవితం ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
బీళ్లు దున్నేరు?: రష్యా విప్లవానంతరం సోషలిజం వైపు మారే క్రమంలో ఎదురైన ప్రతిఘటనలను ఎదుర్కోవడంపై అవగాహన నిచ్చింది.
బోల్షివిక్ విప్లవ చరిత్రః లెనిన్ ఎత్తుగడలు, ప్రపంచంలో మొదటి సోషలిస్టు రాజ్యం ఏర్పాటు విధానాన్ని తెలియజేసింది.
యువజన, విద్యార్థి రంగాల బలోపేతం:
కే. వెంకటయ్య కార్యదర్శిత్వంలో పి. చంద్రారెడ్డి, సూడి క్రిష్ణారెడ్డి, జి. నాగయ్య, మల్లారెడ్డిలతో కూడిన బృందం జిల్లాలో ఉద్యమాన్ని పునర్నిర్మించింది.
కాకతీయ యూనివర్సిటీ, కళాశాలల్లో SFI/DYFIలను పటిష్టం చేశారు. సారంపల్లి మధుసూదన్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, వాసుదేవరెడ్డి, ఎం.చుక్కయ్య తదితరుల నాయకత్వంలో DYFI రాష్ట్ర సమ్మేళనం / యువజనోత్సవాలను వరంగల్లో ఘనంగా నిర్వహించారు.
శ్రీరాంసాగర్ రెండవ దశ, వరద కాలువ పనుల పూర్తికై వరంగల్ జిల్లాలో సీపీఎం ఆధ్వర్యంలో 4000 బుక్లెట్లు వేసి, 200 గ్రామాల్లో విస్తృత ప్రచారం, ధర్నాలు, జిల్లా బంద్ నిర్వహించారు.
భూపోరాటాలు & అమరవీరుల త్యాగాలు:
ఆసరవెల్లి (నల్లబెల్లి మండలం): ఫారెస్టు పరిధిలో ఉన్న 525 ఎకరాల భూమిని అటవీ శాఖతో పోరాడి, 200 మంది పేదలతో ఆక్రమించి 150 ఇండ్లతో గ్రామాన్ని నిర్మించారు.
అశోకనగర్ (పాఖాల చెరువు వెనుక): 1100 ఎకరాల అడవి బంజరు భూములను పేదలకు దక్కించే క్రమంలో 1980 నుండి తీవ్ర పోరాటాలు జరిగాయి. భూస్వాములు, పోలీసుల దాడుల్లో మన్నూరి చిన్నస్వామి, వేల్పుల కోటయ్య, పన్నీరు యాదగిరిలతో సహా మొత్తం 6గురు ప్రాణాలు కోల్పోయారు.
వరంగల్ పట్టణంలో 18 చోట్ల పేదలకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయించారు. ఈ పోరాటంలో కాంగ్రెస్, నక్సలైట్ల నిర్బంధాలను తట్టుకుని నిలబడ్డారు. పోరాటంలో కుసుమ రఘునాథ్ (1999), రామాసురేందర్ (2000), అప్పోజు సమ్మయ్య, మంతెన నారాయణరెడ్డి వంటి పలువురు నాయకులు/కార్యకర్తలు హత్యకు గురయ్యారు.
రచయిత సర్పంచ్గా, సహకార సంఘం అధ్యక్షుడిగా గెలిచి, టీడీపీతో కలిసి DCA Bank డైరెక్టర్గా ఎన్నికయ్యారు. సూడి క్రిష్ణారెడ్డి (గోవిందరావుపేట), కోట నర్సింహారెడ్డి (జనగామ) మండల అధ్యక్షులుగా గెలిచారు.
1991లో పి.వి. నరసింహారావు హయాంలో అరబ్ దేశాలకు మాంసం ఎగుమతి పథకం కింద పశుసంవర్ధక శాఖ ద్వారా ఏర్పడిన గొర్రెల కాపరుల సంఘాలను సీపీఎం సమర్థవంతంగా నిర్వహించింది.
కలెక్టరేట్ ముందు ఆందోళనలు చేపట్టి, జనగాంలో రాష్ట్ర మహాసభ నిర్వహించింది.
, , , , , , , , , #అఖిలభారతకిసాన్సభ, #కమ్యూనిస్టునాయకుడు, #ఘననివాళి, #జీవితసాఫల్యపురస్కారం, #తిమ్మంపేట, #తెలంగాణ, #తెలంగాణరైతాంగం, #నర్సంపేట, #పద్మశ్రీ, #భూపోరాటాలు, #యడ్లపల్లివేంకటేశ్వరరావు, #రైతాంగఉద్యమం, #రైతుఆత్మహత్యలు, #రైతుఉద్యమం, #రైతునాయకుడు, #రైతునేస్తంఫౌండేషన్, #రైతుపోరాటం, #రైతులహక్కులు, #రైతుసంక్షేమం, #రైతుసంఘం, #రైతుసమస్యలు, #రైతుహక్కులు, #వరంగల్, #వ్యవసాయం, #వ్యవసాయసంక్షోభం, #శ్రద్ధాంజలి, #సాగునీరు, #సారంపల్లిమల్లారెడ్డి, agri news, Agriculture, Andhra Pradesh, ChatGPT said: #రైతునేస్తం, natural farming, telangana, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ