27/07/2025
నెరవాటి బ్యాట్మెంటన్ స్టేడియంలో ఘనంగా షటిల్ టోర్నమెంట్
నంద్యాల పట్టణంలోని నెరవాటి బ్యాట్మెంటన్ స్టేడియంలో ఆదివారం డాక్టర్ నెరవాటి పెద్ద స్వామి గారి నాలుగో వర్ధంతి సందర్భంగా డాక్టర్ లక్ష్మయ్య,డాక్టర్ వినోద్ కుమార్, శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో షటిల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో బ్యాడ్మింటన్ స్టేడియం నిర్మించడం జరిగిందని క్రీడాకారులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. డాక్టర్ అలీ భాష, దేవ్
మాట్లాడుతూ నంద్యాల పట్టణం లో షటిల్ బ్యాడ్మింటన్ క్రీడకు మంచి ఆదరణ ఉందని అన్నారు. డాక్టర్ లక్ష్మయ్య మాట్లాడుతూ షటిల్ క్రీడలతో మానసిక ఉల్లాసము ఆరోగ్యము లభిస్తుందన్నారు.శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ నెరవాటి బ్యాడ్మింటన్ అకాడమీ నందు 30 ప్లస్, 40 ప్లస్, 50 ప్లస్ డబుల్ మరియు ట్రిపుల్స్ టోర్నమెంట్ నిర్వహించామన్నారు.టోర్నమెంట్ లో విజయం సాధించిన 30 ప్లస్ లో మొదటి స్థానం శ్రీనివాస్ రెడ్డి హేమంత్, 2 స్థానం శ్రీనివాస్ గుప్త , షఫీ ,40 ప్లస్ లో మొదటి స్థానం మధు, పుల్లయ్య ,రెండో స్థానంలో శ్రీనివాస్ గుప్త , సత్య 50 ప్లస్ లో సుదర్శన్ రెడ్డి ప్రతాపరెడ్డి రెండో స్థానంలో మధుసూదన్ రెడ్డి, రాజు లు కైవసం చేసుకున్నారు. త్రిబుల్ షటిల్ టోర్నమెంటులో మొదటి స్థానం వెంకటరామిరెడ్డి లక్ష్మీకాంతరెడ్డి రాజు, రెండో స్థానం హరి రవి సంజీవరెడ్డి మూడోస్థానం ఫిరోజ్ సత్య మహేష్ యాదవ్ కైవసం చేసుకున్నారు. అనంతరం డాక్టర్ లక్ష్మయ్య, డాక్టర్ వినోద్ కుమార్ శ్రీనివాస్ గుప్త గార్లు విజేతలకు బహుమతులు అందజేశారు.