26/02/2024
నిన్నటి రోజు గుంతకల్ లోని వేంకటేశ్వర స్వామి వారి ఆలయం లో శ్రీ వాగ్దేవి సకల కళా సంస్థ వారు నిర్వహించిన నృత్య నీరాజనం కార్యక్రమం లో ధర్మవరం శ్రీ లలిత నాట్య కళానికేతన్ నాట్య ఆచార్యులు బాబు బాలాజీ, కమల బాలాజీ శిష్య బృందం రామ లాలిత్య,తో పాటు 13 మంది పాల్గొని నర్తించి "నటరాజ నర్తన నంది"అవార్డులు సాధించారు.నాకు ద్వాదశ జ్యోతిర్లింగ కాశీ విశ్వేశ్వర అవార్డు,మాశ్రీమతి కి ,మా అమ్మాయికి శివ పాధ నర్తన"అవార్డులు బహూకరించి సత్కరించారు.వాగ్దేవి సంస్థకు ధన్యవాదములు.